Breaking News

ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్​లు

  • ఈసీబీ సన్నాహాలు

లండన్‌: అంతర్జాతీయ క్రికెట్​ను వీలైనంత తర్వగా గాడిలో పెట్టాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లను నిర్వహించేందుకు కసరత్తుచేస్తోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. యూకే ప్రభుత్వం అనుమతి కోసం కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఔట్​ డోర్ ట్రైనింగ్​ మొదలుపెట్టాలని మరో 37మంది క్రికెటర్లకు ఈసీబీ సూచించింది. ఇప్పటికే 18మంది బౌలర్లు గత వారం నుంచే గ్రౌండ్​తో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం జాబితా 55కు చేరింది.

ఫార్మాట్లకు అనుగుణంగా బలమైన జట్లను తయారు చేయాలనే ఉద్దేశంతో క్రికెటర్ల పూల్​ను పెంచుతున్నామని ఈసీబీ వెల్లడించింది. వన్డే కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, పేసర్లు జేమ్స్‌ అండర్సన్‌, జోఫ్రా అర్చర్‌, అలెక్స్‌ హేల్స్‌, లిమ్‌ ఫ్లంకెట్‌, జో క్లార్క్‌, మొయిన్‌ అలీ, బెయిర్‌స్టో, బ్రాడ్‌, బట్లర్‌, రషీద్‌, కర్రాన్‌, విల్లే, బిల్లింగ్స్‌ ఈ జాబితాలో ఉన్నారు. తమ ట్రైనింగ్​ సాఫీగా సాగేందుకు మెడికల్‌ టీమ్‌, గవర్నమెంట్‌తో కలిసి పని చేస్తున్నామని ఈసీబీ చెప్పింది.