Breaking News

క్రికెట్ గాడిలో పడుతుంది

కలకత్తా: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయని బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఈ క్రమంలో క్రికెట్ కూడా గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘కరోనాను చూసి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికైతే వైరస్​కు మందుల్లేవ్​. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఓ ఆరేడు నెలల్లో వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తారు. ఒక్కసారి వ్యాక్సిన్ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయి.

మనలో అద్భుతమైన నిరోధకశక్తి ఉంది. కాబట్టి అన్నింటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. క్రికెట్ కూడా మళ్లీ గాడిలో పడుతుంది. కాకపోతే షెడ్యూల్​, ఆటలో కొన్ని మార్పులు తప్పకపోవచ్చు’ అని దాదా వ్యాఖ్యానించాడు. ఒకసారి వ్యాక్సిన్‌ వస్తే.. కరోనా కూడా ఫ్లూ, జాండిస్‌ లాగా మారిపోతుందన్నాడు. ఈజీగా నయమవుతుందన్నాడు.