Breaking News

క్రికెట్ కోచ్ ల ఆన్ లైన్ చర్చ

క్రికెట్ కోచ్ ల ఆన్ లైన్ చర్చ

ఫ్యూచర్ ఎట్లుండాలి?

న్యూఢిల్లీ: క్రికెట్ తిరిగి మొదలుపెట్టాకా.. భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండాలనే అంశాలపై టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, ఇండియా–ఏ, జూనియర్ టీమ్ కోచ్ ల మధ్య ఆన్ లైన్ లో చర్చ జరిగింది. తమ ఆలోచనలు, అభిప్రాయాలను ఇందులో పంచుకున్నారు.

జూనియర్ టీమ్ లకు సంబంధించిన కోచ్ లు రవిశాస్త్రి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఆన్ రైన్ చర్చకు రూపకల్పన చేశాడు. లాక్ డౌన్ తో అందరూ అందుబాటులో ఉండడంతో టీమిండియా భవిష్యత్ ఎలా ఉండాలన్న దానిపై అందరి అభిప్రాయాలను తెలుసుకున్నాడు.

‘ఇవేమి ఆన్‌లైన్‌ కోచింగ్‌ క్లాస్‌ లు కాదు. కోచ్‌ల మధ్య ఐడియాలు పంచుకోవడం. శాస్త్రి, అరుణ్‌, శ్రీధర్‌కు అంతర్జాతీయ అనుభవం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లు జూనియర్‌ కోచ్‌లకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇక నుంచి ఇది రెగ్యులర్‌గా కొనసాగుతుంది. లాక్‌ డౌన్‌ ఉంది కాబట్టి అందరూ అందుబాటులో ఉండటంతో ఈజీగా ఆర్గనైజ్‌ చేయగలిగాం’ అని ఎన్‌సీఏ అధికారి ఒకరు వెల్లడించారు.