Breaking News

కొడుకులు చూడడం లేదని..


సారథి న్యూస్, హుస్నాబాద్: కొడుకులు తన బాగోగులు చూసుకోవడం లేదని ఓ వృద్ధుడు సోమవారం అధికారులను ఆశ్రయించాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామపరిధిలోని శంకర్ నగర్ కు చెందిన పోతు మల్లయ్యకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. తనకున్న ఆస్తినంతా కొడుకులు లాక్కొని ఏ ఒక్కరూ చేరదీయకపోవడంతో అధికారులను ఆశ్రయించాడు. వృద్ధుడిచ్చిన ఫిర్యాదుకు స్పందించిన ఆర్డీవో జయచంద్రారెడ్డి మల్లయ్య గ్రామానికి వెళ్లి కొడుకులతో మాట్లాడారు. అయినా వారు వినిపించకపోవడంతో పోతు మల్లయ్యను అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమానికి తరలించినట్లు ఆర్డీవో తెలిపారు.