Breaking News

కార్మికుల సేవలు వెలకట్టలేనివి

కార్మికుల సేవలు వెలకట్టలేనివి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

సారథి న్యూస్, చేవెళ్ల: పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రశంసించారు. శనివారం ఎమ్మెల్యే యాదయ్య పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మద్దెల చింటు ఆధ్వర్యంలో 22 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం చొప్పున అందజేశారు. వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. కరోనా వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, రమణారెడ్డి, జడ్పీటీసీ మర్పల్లి మాలతి, కృష్ణారెడ్డి, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు పి.ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ పాల్గొన్నారు.