![తమ సమస్యలు పరిష్కరించాలంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిస్తున్న ప్రైవట్ టీచర్లు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/SEETHAKKA.jpg?fit=459%2C241&ssl=1)
సారథి న్యూస్, ములుగు: లాక్డౌన్తో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు సోమవారం ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, ఆక రాధాకృష్ణ, మైల జయరాం రెడ్డి, నమాకరం చంద్ బానోతు రవి చందర్, మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.