![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/nrpt-2f.jpg?fit=250%2C152&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: మహిళల సౌకర్యార్థం మొబైల్ ‘షీ టాయిలెట్’ ఏర్పాటు చేయడంపై నారాయణపేట జిల్లా కలెక్టర్ డి.హరిచందనను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభినందించారు. ‘మహిళల కోసం బయోడైజెస్టర్ టాయిలెట్ల ఏర్పాటులో కలెక్టర్ హరిచందన చొరవ ప్రశంసనీయం. ఈ గొప్ప ఆలోచన మహిళలకు సౌకర్యవంతమైనదే గాక భద్రతనూ కల్పిస్తోంది. అలాగే ఇవి బయోడైజెస్టర్ మరుగుదొడ్లు కావడం వల్ల స్థిరత్వం ఉంటుంది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో వీటిని ఏర్పాటుచేశారు. వినియోగంలో లేని ఆర్టీసీ బస్సును మొబైల్ టాయిలెట్గా తీర్చిదిద్దారు. వివిధ పనుల కోసం పట్టణానికి వచ్చే మహిళలు ఇబ్బందుల పడకుండా వీటిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.