Breaking News

కరోనాపై దుష్ర్పచారం తగదు

కరోనాపై దుష్ప్రచారం తగదు

సారథిన్యూస్​, సనత్​నగర్​: కరోనా వచ్చినవారి పేర్లను సోషల్​మీడియాలో షేర్​ చేసినా.. వారిపై దుష్ప్రచారం చేసినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని సనత్​నగర్​ సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో కరోనా రోగులు పేర్లు షేర్​ చేస్తున్నారని ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. కరోనా రోగులను కించపరిచే పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా రోగులను దయతో చూడాలని.. వారికి దూరంగా ఉంటూ మాస్కులు, గ్లౌజులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవకాశం ఉంటే ఏదైనా సాయం చేయాలని పేర్కొన్నారు.