![షార్ట్ న్యూస్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/short-news-e1587967780849.jpg?fit=229%2C173&ssl=1)
సారథి న్యూస్,రంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో మూసి ఉంచిన కరాటే శిక్షణ కేంద్రాలను నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎల్బీనగర్ నియోజకవర్గం కరాటే మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీవీ శ్రీరాములు, ఆర్గనైజర్స్ పి.శ్రీశైలం యాదవ్, జి.నాగరాజు లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమవారం కర్మన్ఘాట్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కరాటే మాస్టర్లు మీటింగ్ నిర్వహించారు. ఈ శిక్షణ కేంద్రాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మాస్టర్స్ తమ జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ పెనుభారంగా మారిందని, ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆదుకోవాలని వారు కోరారు. సమావేశంలో శంకర్, రంజిత్, మహేష్, అభిరామ్, సాయి, జి.శివ, శంకర్, మంజునాథ్, నవనీత్, రాము పాల్గొన్నారు.