![సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/SINGIREDDY-NIRANJANFF.jpg?fit=700%2C515&ssl=1)
సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ ప్రజలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. ఆ గ్రామంలో 50 మంది నిరుపేదలకు త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆగస్టు 1న గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత తేజవర్ధన్, ఎంపీటీసీ, రైతు సమన్వయసమితి నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామప్రజలు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.