![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/short-news-new-e1594233968806.jpg?fit=150%2C68&ssl=1)
పాట్నా: కరోనా ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు దారుణానికి ఒడిగట్టాడు. కరోనా రోగి బాగోగులు చుసుకొనేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ దారుణ ఘటన పాట్నాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో జూలై 8 న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని బిహార్లోని దనాపూర్కు చెందిన మహేశ్ కుమార్(40) గుర్తించారు. మహేశ్ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. ప్రసుతం అతడు ఓ ప్రైవేట్ దవాఖానలో సెక్యూరిటీ గార్డుకు పనిచేస్తున్నాడు. మహేశ్ తీరుపట్ల సోషల్మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ నీచుడిని బహిరంగంగా కాల్చిచంపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.