Breaking News

ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దు

సారథి న్యూస్​, వరంగల్​: కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఆకలితో ఏ ఒక్కరూ బాధపడకూదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్​విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ అన్నారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ లో చాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. కార్మికుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్​ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. లాక్​ డౌన్​ కారణంగా అసంఘటిత రంగ కార్మికులు కొందరు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, కార్పొరేటర్ అనిశెట్టి సరిత, డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్ పాల్గొన్నారు.