![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/wgl-2final.jpg?fit=1248%2C694&ssl=1)
సారథి న్యూస్, వరంగల్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆకలితో ఏ ఒక్కరూ బాధపడకూదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ లో చాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. కార్మికుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా అసంఘటిత రంగ కార్మికులు కొందరు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, కార్పొరేటర్ అనిశెట్టి సరిత, డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్ పాల్గొన్నారు.