Breaking News

ఎక్స్​ట్రా రివ్యూ.. అందుకోసమే

  • ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే

న్యూఢిల్లీ: స్థానిక అంపైర్లకు టెస్ట్ మ్యాచ్ అనుభవం లేకపోవడంతోనే అదనంగా మరో రివ్యూను ప్రతిపాదించామని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు. మ్యాచ్​లో ఎలాంటి తప్పులు జరగొద్దని, ఏ జట్టు నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. ‘క్రికెట్​ను సురక్షితంగా, సజావుగా గాడిలో పెట్టడమే మన ముందున్న లక్ష్యం. మ్యాచ్​లో పారదర్శకత కోసం 20 ఏళ్ల నుంచి తటస్థ అంపైర్లను ఉపయోగిస్తున్నాం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ట్రావెల్ నిషేధంతో పాటు క్వారంటైన్ నిబంధనలు ఆటంకంగా మారాయి. ఎలైట్ ప్యానెల్​లో అంపైర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే స్థానిక అంపైర్లపై మేం దృష్టిసారించాం. వీళ్లను తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు జరగొచ్చనే ఉద్దేశంతో ఎక్స్​​ట్రా రివ్యూను ప్రతిపాదించాం. వీళ్లకు అనుభవం లేకపోవడం కూడా దీనికి కారణం’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు.