Breaking News

ఊరు శుభ్రత అందరి బాధ్యత

చేవెళ్ల సర్పంచ్ శైలజాఆగిరెడ్డి

సారథి న్యూస్, చేవెళ్ల: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత అందరిపై ఉందని చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి సూచించారు. శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాలనీలతో పాటు షాపుల ఎదుట పరిశుభ్రతను పాటించాలని సర్పంచ్​ సూచించారు. తడి పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ వాహనంలో వేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్​ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ సున్నపు వసంతం, గుండాల రాములు, డైరెక్టర్ పాటీ దామోదర్ రెడ్డి, ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.