Breaking News

ఉల్లం‘ఘనుల’పై ఉక్కుపాదం

ఉల్లం‘ఘనుల’పై ఉక్కుపాదం

–వాహనాలు సీజ్.. చలానా విధింపు

సారథి న్యూస్, అనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అనంతపురం జిల్లా పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. లాక్ డౌన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో విపత్తు నిర్వహణ, తదితర చట్టాల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వివిధ కేసులు నమోదుచేశారు. రోడ్డుభద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,07,982 నమోదుచేసి..రూ.4,63,05,620 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2,604 వాహనాలను సీజ్ చేశారు. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కూడా కేసులు నమోదు చేశారు. వారి నుండి రూ.11,70,804 నగదు, 952 లీటర్ల నాటుసారా, 18 లీటర్ల కల్లు, నాటు సారా తయారీకి వినియోగించే 95 కిలోల బెల్లం, 1306 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.