Breaking News

ఉమ్మి నిషేధం తాత్కాలికమే

  • ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే

న్యూఢిల్లీ: క్రికెట్ బంతిపై మెరుపు పెంచడానికి ఉమ్మి వాడొద్దని పెట్టిన అంక్షలు తాత్కాలికమేనని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే అన్నాడు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత ఈ అంక్షలు తొలిగిస్తామన్నాడు. అప్పుడు సాధారణ పరిస్థితుల్లోనే మ్యాచ్లు జరుగుతాయని స్పష్టం చేశాడు. ‘క్రికెట్​కు హాని కలిగించే చాలా అంశాలను చాలాసార్లు దూరంపెట్టాం. ఇలాంటి విషయాల్లో కఠినంగా కూడా వ్యవహరించాం. ఇప్పుడు కూడా అంతే. సాధారణ పరిస్థితులు వచ్చాకా ఉమ్మి నిషేధాన్ని పక్కనబెట్టేస్తాం.

చరిత్రను పరిశీలిస్తే ఇవన్నీ తెలుస్తాయి. 2018 బాల్ టాంపరింగ్ ఘటన కూడా ఇందుకు ఓ ఉదాహరణ’ అని కుంబ్లే వివరించాడు. కరోనాతో క్రికెటర్ల ఆరోగ్యం రిస్క్​లో పడే అవకాశం ఉండడంతో బంతిమెరుపు పెంచేందుకు ఉమ్మిని వాడడం ఇటీవల రద్దుచేశారు. అయితే చెమటతో బంతిని షైన్ చేయొచ్చని క్రికెట్ కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.