Breaking News

ఉత్సాహంగా హరితహారం

సారథి న్యూస్, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కె.తారక రామారావు సనత్ నగర్ నియోజవర్గం బల్కంపేట శ్మశానవాటికలో గురువారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ లక్ష్మి బాల్ రెడ్డి పాల్గొన్నారు. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్​పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజవర్గంలోని దుండిగల్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిక్యూటివ్ నం.5 వద్ద మొక్కలు నాటారు