Breaking News

ఈత.. విషాదం నింపొద్దు

  • మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి

సారథి న్యూస్, మెదక్: ఈతకు వెళ్లి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చకూడదని మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి హెచ్చరించారు. ఎండాకాలం సెలవుల కారణంగా పట్టణాలు, గ్రామాల్లో స్టూడెంట్స్​, యువకులు పొలాలు, బావులు, చెరువుల వెంట కాలక్షేపం చేస్తున్నారని, ఈతకు మునిగి చనిపోయి కన్నవారికి శోకం మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈతకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెద్దలను వెంట పెట్టుకుపోవాలని సూచించారు. ఈతకు వెళ్లే చిన్నారులపై పేరెంట్స్​ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి వ్యక్తికి ఈత నేర్చుకొవాలన్న సరదా ఉంటుందని, అయితే శిక్షకులు, నిపుణులు లేకుండా ఈతకు వెళ్లొద్దని ఎస్పీ చందనాదీప్తి సూచించారు.