Breaking News

ఇప్పుడే ట్రైనింగ్​ వద్దు

ఇప్పుడే ట్రైనింగ్​ వద్దు

న్యూఢిల్లీ: ఈనెలాఖరు వరకు ట్రైనింగ్ క్యాంప్​లో చేరాలని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ)కు టీటీ ప్లేయర్లు షాక్​ ఇచ్చారు. ఇప్పుడే ట్రైనింగ్ వద్దని, ఇంకొంత కాలం వేచి చూడాలని చెప్పారు. స్టార్ ప్లేయర్‌ శరత్‌ కమ్‌తో పాటు టాప్‌–16 ప్లేయర్లంతా ట్రైనింగ్​ కు రావడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దేశంలో ప్రయాణ నిషేధం ఉన్న సమయంలో ట్రావెల్ చేయడం ఇష్టం లేదని కమల్‌ పేర్కొన్నాడు. నిస్‌ పాటియాలా, సోనాపేట్‌, కోల్‌కతాలో టీటీ ట్రెయినింగ్‌ క్యాంప్‌లు కొనసాగుతున్నాయి.