Breaking News

ఇంటర్​ ఫలితాలు విడుదల

సారథిన్యూస్​, హైదరాబాద్:​ తెలంగాణ ఇంటర్మీడియట్​ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్​ ఫస్టియర్​, సెకండియర్​ రెండూ కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 2.88 లక్షల మంది ఫస్టియర్​ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి ఏడాది ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. 67.4 శాతం మంది బాలికలు, 52.30 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 2.83 లక్షల మంది ఇంటర్​ సెకండియర్​లో ఉత్తీర్ణత సాధించగా.. 71.15శాతం బాలికలు, 62.10 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 75 శాతం ఉత్తీర్ణతతో ఇంటర్​ ఫస్టియర్​లో మేడ్చల్​ జిల్లా, 76 శాతం ఉత్తీర్ణతతో కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా ఇంటర్​ సెకండియర్​లో ప్రథమస్థానంలో నిలిచింది. సప్లిమెంటరీ పరీక్ష వివరాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఏదైనా సందేహాలకు 7337225803, 7337225424, 7337225364, 7337225360, 7337005083, 7337225098, 7337225763 ఈ నంబర్లను సంప్రదించవచ్చు.

https://uc.xyz/2H76kP?pub=link [Manabadi TS Intermediate First 1st Year Results 2020 from Manabadi.com] is good,have a look at it! కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.