![ఆర్ఎంపీ మృతికి నివాళి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/IMG-20200425-WA0033.jpg?fit=1280%2C593&ssl=1)
సారథి న్యూస్, అలంపూర్: మూడు రోజుల క్రితం మృతిచెందిన అలంపూర్ కు చెందిన ఆర్ఎంపీ తిమ్మప్ప మృతికి శనివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు.
అలంపూర్ లో పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయన మృతి తీరని లోటని ప్రముఖ న్యాయవాది నాగరాజు యాదవ్ అన్నారు.
అలాగే పట్టణ ప్రజలంతా స్వచ్ఛందంగా వారి ఇళ్ల వద్ద భౌతిక దూరం పాటిస్తూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ పాల్గొన్నారు.