Breaking News

ఆదివాసీలతో పవర్ ​స్టార్​ ముచ్చట్లు

ఆదివాసీలతో పవర్​స్టార్​ ముచ్చట్లు


పాలిటిక్స్​కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలతో బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్​లో తెరకెక్కిస్తున్న బాలీవుడ్ సంచలనాత్మక మూవీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్లు, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను కొన్ని అరకులో షూట్ చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో అజిత్ ప్రధాన పాత్రధారిగా ‘నేర్కొండ పార్వై’ గా వచ్చి అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిజానికి ‘పింక్’ చిత్రంలో లాయర్ అమితాబచ్చన్​ రోల్ కు ఫ్లాష్ బ్యాక్ ఉండదు. అజిత్ నటించిన నేర్కొండ పార్వైలో మాత్రం డైరెక్టర్ వినోద్ అక్కిడి నేటివిటికీ తగ్గట్టుగా కొన్ని ఫ్లాష్​బ్యాక్ సీన్లను యాడ్ చేశారు. అందులో అజిత్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించారు. ‘వకీల్ సాబ్’కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఈ ఫ్లాష్ ​బ్యాక్​ సీన్లను షూట్ చేసేందుకు టీమ్ మొత్తం అరకులో తిష్టవేసింది. అయితే షూటింగ్ గ్యాప్ లో అరకు లోపల నివశించే ఆదివాసీలతో పవన్ మచ్చట్లకు దిగారు. అక్కడ వాళ్లు తమ సంప్రదాయాల గురించి పవన్ కు పాట రూపంలో వినిపించారట. అదంతా వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించారు పవన్. ‘ఇది వింటుంటే బిభూతి బందోపాధ్యాయ రచించిన బెంగాలీ నవల బనబాసి తెలుగులో ‘వనవాసి’ గుర్తుకు వచ్చింది..’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఇంతకుముందు సంవత్సరం సరిగ్గా ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ జనసేన నేతగా అరకు వెళ్లి అక్కడి ఆదివాసీలను కలిశారు. ఈ సినిమా షూటింగ్ ముగిశాక పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్ర షూటింగ్​లో పాల్గొనాల్సి ఉంది.