Breaking News

ఆగస్టు 16 నుంచి క్లాసులు

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి వృత్తి విద్య, సాంకేతిక విద్యాసంస్థలను ప్రారంభించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది. శుక్రవారం ఇందుకు సంబంధించిన అకడమిక్​ క్యాలెండర్​ను విడుదల చేశారు. ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్​ 1 నుంచి, ఇతర విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాలని చెప్పింది ఏఐసీటీఈ. మిగతా విద్యార్థులకు మాత్రం ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును జులై 15 వరకు ఇవ్వనున్నట్టు తెలిపింది. గతంలో దీని గడువు జూన్ 30గా ఉంది. అలాగే.. ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్‌ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్‌ పూర్తి చేసి మిగిలిన సీట్లను సెప్టెంబరు 15లోగా పూర్తి చేయాలని సూచించింది.