Breaking News

పంచెకట్టులో ప్రధాని మోడీ

అయోధ్యకు బయలుదేరిన ప్రధాని

అయోధ్య: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలుదేరారు. రోజువారి వస్త్రధారణకు భిన్నంగా మోడీ పంచెకట్టులో కనిపించారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్‌లో అయోధ్యకు ప్రధాని పయనమవుతారు. తొలుత ఆయన హనుమాన్‌ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అయోధ్యను అధికారులు అణువణువునా శానిటైజ్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రంగురంగుల పూల దండలు, కాషాయ తోరణాల అలంకరణలతో అయోధ్య శోభాయమానంగా మారింది. కాగా మరోవైపు ఈ అద్భుత దృశ్యాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించేందుకు టీవీలకు అతుక్కుపోయారు.