Breaking News

అదనపు గదులు ప్రారంభం

సారథి న్యూస్​, నారాయణపేట: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడ్జింత గ్రామంలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రులు ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.