సారథిన్యూస్, రామడుగు: మోకాళ్ల నొప్పులు తట్టుకోలేక.. నడువలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంగనగర్ జిల్లా రామడుగు మండలం గండికి చెందిన జనగం రాజయ్య (80) కొంతకాలంగా నడవలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు కమలాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష తెలిపారు.
- July 8, 2020
- Archive
- కరీంనగర్
- క్రైమ్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KARIMNAGAR
- RAJAIAH
- RAMADUGU
- SUCIDE
- ఆత్మహత్య
- వృద్ధుడు
- Comments Off on వృద్ధుడి బలవన్మరణం