Breaking News

మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం

షిల్లాంగ్​: కరోనాను కట్టడి చేసేందుకు మేఘాలయ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. జూలై 24 నుంచి 31 వరకు ఆ రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయనున్నది. కరోనా కట్టడిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్​రాడ్​ సంగ్మా బుధవారం మీడియాకు తెలిపారు. అత్యవసర సేవలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు మేఘాలయ రాష్ట్రంలో 270 కరోనా కేసులు నమోదయ్యాయి. చిన్నరాష్ట్రమైనప్పటికి అత్యధిక సంఖ్యలో టెస్టులు చేస్తూ.. ఎప్పటికప్పడు కరోనాను కట్టడి చేస్తున్న మేఘాలయను కేంద్రప్రభుత్వ అభినందించింది.