సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు ద్వారా డ్రైనేజీ నీరు చాలావరకు నదుల్లో చేరి కలుషితం కాకుండా చూసుకోవడంతో పాటు బయోలాజికల్ విధానాల ద్వారా శుద్ధిచేయొచ్చని కమిషనర్డీకే బాలాజీ సూచించారు. మంగళవారం స్థానిక విఠల్ నగర్ నుంచి కల్లూర్ లోని చెంచు నగర్ కు వెళ్లే దారిలో హంద్రీనది కాజ్ వే వంతెన వద్ద నిర్మిస్తున్న రెండు ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను ఆయన పరిశీలించారు. ప్లాంట్ మ్యాప్ ను చూసి వివరాలను తెలుసుకుని కార్యాచరణకు అనుగుణంగా పనులు చేయాలని సూచించారు. ఆయన వెంట ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ సురేంద్రబాబు, పబ్లిక్ హెల్త్ ఈఈ రామ్మోహన్ రెడ్డి, డీఈలు ఉన్నారు.
- September 2, 2020
- Archive
- DK BALAJI
- Kurnool
- MUCIPALITY
- SEWAGETREATMENT PLANT
- కమిషనర్
- కర్నూలు
- మురుగునీటి శుద్ధికేంద్రం
- Comments Off on మురుగునీటి శుద్ధికేంద్రాలతో ప్రయోజనం