![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/AGRII-CCCC-TTTF.jpg?fit=729%2C412&ssl=1)
సారథిన్యూస్, రామాయంపేట: పట్టాపాస్ పుస్తకాలు ఉన్నవారందరూ రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీశ్ కోరారు. జూన్ 16, 2020 వరకు పట్టా పాస్ బుక్ లు వచ్చిన రైతులంతా ఈ పథకానికి అర్హులేనని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల వయస్సు నుంచి 59 సంవత్సరాల వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులని చెప్పారు. మండలంలో ఇప్పటి వరకు 5697 మంది రైతులు రైతు భీమా కు తమ పేరును నమోదు చేసుకున్నారన్నారు. ఇంకా 437 మంది రైతులు పేర్ల ను నమోదు చేసుకోవాల్సి వారు వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.