![పెనుగోలులో వైద్యపరీక్షలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/vjd-2.jpg?fit=677%2C293&ssl=1)
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు గిరిజనులకు 20 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మాతాశిశు సంరక్షణ వైద్యాధికారి డాక్టర్ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా పెనుగోలు గిరిజనుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నామని, వారికి వైద్యపరీక్షలు నిర్వహించామని తెలిపారు. 20 మందికి జ్వరాలు ఉండగా, వారి నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షించగా ముగ్గురికి మలేరియా ఉన్నట్లు గుర్తించి మందులు ఇచ్చామన్నారు. అలాగే పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మందులు ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక గిరిజనులకు పలు వ్యాధులపై అవగాహన కల్పించినట్లు వివరించారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ మాలతి, హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేష్, ఆశా కార్యకర్త సమ్మక్క, డ్రైవర్ రాంబాబు పాల్గొన్నారు.