న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులు, మొబైల్ అప్లికేషన్లు (యాప్స్) నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వచ్చిన తరుణంలో 59 యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో బాగా పాపులర్ అయిన టిక్టాక్, హెలో, యూసీ బ్రౌజర్, న్యూస్ డాగ్ వంటి యాప్లు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69 ఏ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు 2019ను అనుసరించి భద్రతాపరంగా పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఈ యాప్లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఈ పరిణామాలపై టిక్టాక్ మంగళవారం స్పందించింది. తన వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్లో ఇవ్వబోమని టిక్టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ స్పష్టం చేశారు. 14 భారతీయ భాషల్లో లక్షలాది మందికి ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వినియోగదారులు, కళాకారులు, స్టోరీ టెల్లర్స్, విద్యావేత్తలు..ఇలా ఎంతోమందికి జీవనోపాధిని అందిస్తున్నామని వెల్లడించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
- June 30, 2020
- Archive
- Top News
- జాతీయం
- CHINA
- TIKTOK
- UCBROWSER
- టిక్టాక్
- మొబైల్ అప్లికేషన్లు
- హెలో
- Comments Off on నిషేధంపై స్పందించిన టిక్టాక్