సారథి న్యూస్, కర్నూలు: ఏపీ లాయర్లకు సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మార్చి నుంచి జూన్ వరకు ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. మూడు నెలలకు గానూ సుమారు రూ.2.91 కోట్లను 5,832 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. కాగా, వృత్తిలో నిలదొక్కుకునేందుకు జూనియర్ న్యాయవాదులకు అండగా ఉండేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పధకాన్ని గతేడాది డిసెంబర్ 3న ప్రారంభించారు. జూనియర్ న్యాయవాదులకు ఈ పథకం కింద ప్రతినెలా రూ. 5,000 చొప్పున మూడేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది.
- July 8, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AP
- LAWYER
- YSR
- ఏపీ
- లాయర్
- వైఎస్సార్ లానేస్తం
- Comments Off on ఏపీ లాయర్లకు గుడ్ న్యూస్