![ఆన్ లైన్ లో సెమిస్టర్లు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/Screenshot_20200424-1627322.png?fit=960%2C612&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల సెమిస్టర్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించే విధానం ప్రవేశపెట్టాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇంటర్ నెట్ స్పీడ్ పెంచడం, బ్యాండ్ విడ్త్, సెక్యూరిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. దేశంలోని టెక్నాలజీ వర్సిటీల్లో ఆన్లైన్ పరీక్షలపై అధ్యయనం జరుగుతున్నదని జేఎన్టీయూహెచ్ ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.