Breaking News

‘జహీరాబాద్’లో బీజేపీ జెండా ఎగరేస్తాం

‘జహీరాబాద్’లో బీజేపీ జెంగా ఎగరేస్తాం


సారథి న్యూస్, పెద్దశంకరంపేట: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయ సాధనకు నిరంతరం కృషిచేస్తామని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందుకెళ్తుందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వారి వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ యాదవ్, ఓబీసీ నాయకులు శ్రావణ్, సురేందర్, చంద్రశేఖర్, వేణుగోపాల్, పత్రి రామకృష్ణ, మాణిక్ పాల్గొన్నారు.