![కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు ఉద్యమం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/05/cpi.jpeg11.jpg?fit=655%2C313&ssl=1)
సారథి, రామడుగు: కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకోసం కార్మిక లోకం ఉద్యమించాలని కరీంనగర్సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మే డే సందర్భంగా రామడుగు మండలంలోని దేశరాజుపల్లి, రామడుగు, గుండి, లక్ష్మిపూర్, గోపాలరావుపేట తదితర గ్రామాల్లో ఎర్రజెండా ఎగరవేసి కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని తాకట్టు పెడుతూ రైతులను వారి భూముల్లోనే పాలేర్లుగా మార్చుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల పాలనను తలపిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మచ్చ రమేష్, గొడిశాల తిరుపతి గౌడ్, ఎగుర్ల మల్లేశం, వేముల మల్లేశం, కనకయ్య, లక్ష్మణ్, రాజయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.