సారథి న్యూస్, మానవపాడు: అయోధ్య నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో రాముడి ప్రతిమతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. జనహిత, హిందువాహిని ఆధ్వర్యంలో కోలాటాలు వేశారు. నృత్యాలు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆద్యంతం ఊరేగింపు కన్నులపండుగా సాగింది. ఎన్నో ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల నిరీక్షణ సఫలమై భవ్య రామ మందిర నిర్మాణం అవుతున్నందున అందరూ తమవంతు సహాయ సహకారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి, శివరామిరెడ్డి, పుల్లారెడ్డి, రామచంద్రయ్య, బీజేపీ నాయకులు రాజశేఖర్ శర్మ, మధుసూదన్ గౌడ్, రుక్మాంగధరెడ్డి, వెంకట్రామిరెడ్డి, తులసీరామయ్య, సీతారామిరెడ్డి, రఘునాథరెడ్డి, భజన మండలి సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.
- January 28, 2021
- Archive
- Top News
- జాతీయం
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- AYODYA
- JAI SRIRAM
- SRIRAMA SHOBHAYATHRA
- అయోధ్య
- జై శ్రీరామ్
- శ్రీరాముడి శోభాయాత్ర
- Comments Off on ఘనంగా శ్రీరాముడి శోభాయాత్ర