Breaking News

ఉరకలేస్తున్న కృష్ణమ్మ

ఉరకలేస్తున్న కృష్ణమ్మ
  • గంట గంటకు పోటెత్తుతున్న వరద
  • 4.75 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
  • జూరాల 45 గేట్ల ఎత్తివేత

సారథి, జూరాల(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లాలోని కృష్ణానదికి వరద ప్రవాహం గంట గంటకు ఉధృతంగా పెరుగుతోంది. దిగువన శ్రీశైలం వైపునకు ఉరకలేస్తోంది. జూరాల ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే బీచుపల్లి వద్ద పుష్కరఘాట్లను ముంచెత్తింది. ఎగువ నుంచి నీటి విడుదల పెరిగితే ఆలయాన్ని వరద తాకనుంది. ఈ నేపథ్యంలో నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.