Breaking News

అనుమానస్పదంగా మహిళా మృతి

సామాజిక సారధి , బిజినపల్లి: అనుమానస్పదంగా మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని పాలెం గ్రామ రోడ్డులో చోటుచేసుకుంది . బిజినపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (28) అనే మహిళ బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటికి పోయి ఆమె ఇంటిలోనే రక్తపు మరకలతో మృతి చెందినట్లు తెలిసింది .. ఆమె ఇంట్లో ఒక వృద్ధురాలు తో పాటు లక్ష్మమ్మ కూడా ఉండేదని బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిందని వృద్ధురాలు తెలియజేస్తుంది .

తెల్లవారి జామున చూసేసరికి ఇంట్లో ఫ్యాన్ కు చీరతో లక్ష్మమ్మ మెడకు బెడ్ మీద పడి ఉందని ఆమె అన్నారు . విషయం తెలుసుకున్న పలువురు బంధువులు పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని మహిళను పరిశీలించగా మెడ కింద గాయంతో పాటు , వీపు బాగా నా రక్తపు దెబ్బలు ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులు పోస్టుమార్టం కొరకు నాగర్కర్నూల్ కు తరలించారు .. మహిళా మృతి మిస్టరీగా ఉండడంతో మహిళ మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలను పుట్టుకొస్తున్నాయి .