Breaking News

పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలి

పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలి

సారథి, రామడుగు: నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు మండలంలోని వెదిర, దేశరాజ్ పల్లి గ్రామాల్లో ఎండిన పంట పొలాలను స్థానిక సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. వెదిరలో రామారావు అనే రైతుకు చెందిన మూడెకరాల పొలం ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని, ఎంతో శ్రమటోడ్చి పంట వేస్తే ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు. పంటలు ఎండిపోయినా, ఎలాంటి నష్టం సంభవించినా రైతులకు మనోధైర్యం కల్పించాలన్నారు. ఎకరాకు కనీసం రూ.30వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్​చేశారు. పంటలను పరిశీలించిన వారిలో సీపీఐ మండల కార్యదర్శి ఉమ్మెంతల రవీందర్ రెడ్డి, మచ్చ రమేష్, ఎగుర్ల మల్లేశం, వేముల మల్లేశం, కనకయ్య, లచ్చవ్వ పాల్గొన్నారు.