![విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/books.jpg?fit=655%2C299&ssl=1)
సారథి, పెద్దశంకరంపేట: విద్యార్థులు విద్యతో పాటు అన్నిరంగాల్లోనూ రాణించాలని బాలికల ఉన్నత పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం లత సూచించారు. శుక్రవారం బాలికల ఉన్నత పాఠశాలలో బుక్స్ పంపిణీ చేశారు. భవిష్యత్లో రాణించాలంటే విద్యార్థి దశ కీలకమని ఆమె సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ రవీందర్, టీచర్లు రామకృష్ణగౌడ్, జనార్ధన్, సల్మా, సోనుభాయ్, బసమ్మ, ఎమ్మార్పీ సిబ్బంది సంగమేశ్వర్ పాల్గొన్నారు.