![రాజన్నకు తీరొక్క మొక్కులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/raja.jpg?fit=655%2C425&ssl=1)
సారథి, వేములవాడ: శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ జీవీ రాంకిషన్ ఆదివారం కుటుంబసమేతంగా దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆత్మీయ స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి లడ్డూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.