Breaking News

ప్రసన్నాంజనేయ స్వామికి విశేష పూజలు

ప్రసన్నాంజనేయ స్వామికి విశేషపూజలు

సారథి, మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని ఆర్కే పురం కాలనీలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఆఖరి రోజు వైభవంగా జరిగాయి. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జగిని రమేష్ గుప్త, కార్యనిర్వహణ అధికారి చిలుకూరి రంగారావు, జూనియర్ అసిస్టంట్ రామ్మోహన్ రావు, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత, ఎస్ సెల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు, సీనియర్ నాయకులు నల్లెంకి ధనరాజ్ గౌడ్, ఆలేటి కిరణ్ కుమార్, బొడ్డుపల్లి మహేందర్, శిరీష, రాకేష్ పాల్గొన్నారు.