Breaking News

మధ్యాహ్నం ఒంటి గంట వరకే షాపులు

మధ్యాహ్నం ఒంటి గంట వరకే షాపులు

సారథి, పెద్దశంకరంపేట: రోజురోజుకూ కొవిడ్-19 విస్తరిస్తున్న దృష్ట్యా మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటలో అన్ని వర్తక, వాణిజ్య, ఇతర వ్యాపార సంస్థలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరిచి ఉంచాలని, అనంతరం మూసివేయాలని పెద్దశంకరంపేట సర్పంచ్ ఆలుగుల సత్యనారాయణ కోరారు. శుక్రవారం పేట పట్టణంలో పురవీధుల గుండా తిరుగుతూ మైక్ ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేశారు. ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఈవో విఠల్​, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.