Breaking News

ఘనంగా శోభాయాత్ర

ఘనంగా శోభాయాత్ర

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం శివాజీ యువసేన, భజరంగ్ దళ్, వివేకానంద ఉత్సవ సమితి, శ్రీరామ్ సేన తదితర యువజన సంఘాల ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఛత్రపతి శివాజీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ‘జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్.. జై శివాజీ.. వీరభవానీ.. భారత్ మాతాకి జై’ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల గుండా భారీ శోభాయాత్ర నిర్వహించారు. అలాగే మండల పరిధిలోని గొట్టిముక్కుల, కమలాపూర్, నారాయణపల్లి, రామోజీపల్లి తదితర గ్రామాల్లో జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల బాధ్యులు మహంకాళి కృష్ణమూర్తి, సతీష్ గౌడ్, సర్వేశ్వర్, సీతారామారావు, రవివర్మ, రామకృష్ణ, శైలేష్, విశ్వేశ్వర్, చందు ఆయా గ్రామాల నుంచి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.