సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ చరణ్ సింగ్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తిరుమలాపూర్ లో సర్వే నంబర్ 1, 256లో భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. వాటిని అక్రమ లేఅవుట్లుగా మార్చి విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రాయని మధు, రాజేంద్రగౌడ్, జైహింద్ రెడ్డి, నారాగౌడ్, రఘుపతిరెడ్డి, సాయిలు పాల్గొన్నారు.
- July 2, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CONGRESS
- medak
- కాంగ్రెస్
- పెద్దశంకరంపేట
- భూకబ్జా
- మెదక్
- Comments Off on ప్రభుత్వ భూములను కాపాడండి