![కొప్పొల్ ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/MDK11.jpg?fit=1087%2C413&ssl=1)
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మహాశివరాత్రి పర్వదినం ఉత్సవాల సందర్భంగా మండల పరిధిలోని కొప్పల్ సంగమేశ్వర ఆలయం ఆవరణలో నిర్వహించే జాతర ఏర్పాట్లను పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ పరిశీలించారు. తహసీల్దార్ చరణ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కొప్పొల్ జాతర ఉత్సవాలు 13వ తేదీ వరకు నాలుగు రోజులు కొనసాగుతాయని వివరించారు. భక్తులకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, ఆలయ కమిటీ సభ్యులను కోరారు. సమావేశంలో ఎస్సై నరేందర్, ఎంపీవో రియాజుద్దీన్, ఆలయ కమిటీ సభ్యులు పద్మ బాపిరాజు, రాయని విఠల్, కందుకూరి నర్సింలు, సర్పంచ్లు అనంతరావు, రమ్య అశోక్ ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.