![పాలెం వెంకన్నకు రూ.రూ.3.17లక్షల ఆదాయం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/NGKL1.jpg?fit=677%2C358&ssl=1)
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా పాలెం అలువేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. నాలుగు నెలలకు సంబంధించి రూ.3,17,455 ఆదాయం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు. దేవాదాయశాఖ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్స్పెక్టర్ వీణా సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్.ఆంజనేయులు, మాజీ చైర్మన్ నరసింహాస్వామి గుప్తా, సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజు, ఉపసర్పంచ్ చికొండ్ర రాములు, గ్రామపెద్దలు పాలది మల్లికార్జున్, ఎస్ బాలస్వామి, ఆనంద్, జగదీశ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.