Breaking News

మందేసి.. చిందేశారు

మందేసి.. చిందేశారు
  • 3146 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

సామాజికసారథి, హైదరాబాద్: మహానగరం హైదరాబాద్ లో డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. భారీగా మద్యం అమ్మకాలు సాగాయి. మందేసిచిందేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే బయటకు తాగి వచ్చిన వారిని పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో బుక్ చేశారు. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయయి.  నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 3146 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్లో 1258, సైబరాబాద్ కమిషనరేట్లో 1528, రాచకొండ కమిషనరేట్లో 360 కేసులు నమోదయ్యాయి. ఈ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు 265 బృందాలతో తనిఖీలు నిర్వహించారు.  అదృష్టవశాత్తూ తాగి చేసిన పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే వైన్ షాపులు బార్లు, పబ్బులు డిసెంబర్ 31వ  తేదీ రాత్రి 1 గంటల వరకూ పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో మందుబాబులు పండుగ చేసుకున్నారు.