![సైబర్ నేరాలకు చెక్ పెడదాం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/vj11.jpg?fit=677%2C352&ssl=1)
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీసు సముదాయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్ జి పాటిల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్తులకు శిక్షపడేలా కృషిచేయడంలో ముందంజలో ఉందన్నారు. నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో జిల్లాలోని పోలీసు సిబ్బంది శిక్షణ ఇవ్వాలని ఐటీకోర్ సిబ్బందిని ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ విభాగాలను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ములుగు ఏఎస్ పీపీ సాయిచైతన్య, ములుగు ఓఎస్ డీ శోభన్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రెహమాన్, ఐటీకోర్ సిబ్బంది కృష్ణంరాజు, రాజేంద్రప్రసాద్, జశ్వంత్ పాల్గొన్నారు.