Breaking News

కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం

పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్​జిల్లా చొప్పదండి పట్టణంలోని 8వ వార్డ్ కౌన్సిలర్​రాజన్నల ప్రణీత ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వార్డు సమస్యలు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు. సభ్యుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. పట్టణ అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ రవి, వార్డు స్పెషలాఫీసర్ పవన్ పి.మహేష్, బిల్ కలెక్టర్లు ప్రభాకర్, ఆర్పీ సౌందర్య, ఆశా కార్యకర్త లావణ్య, అంగన్​వాడీ టీచర్ లలిత, పంప్ ఆపరేటర్ సంతోష్, కమిటీసభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.